తెలంగాణ
Siddipet: లక్ష్మీ నరసింహ జాతరకు పోటెత్తిన భక్తులు.. క్యూ లైన్ లో స్వల్ప తోపులాట

Siddipet: సిద్దిపేట జిల్లా కోహెడలోని శ్రీ ప్రతాపరుద్ర లక్ష్మీ నరసింహ సింగరాయ జాతరకు భక్తులు పోటెత్తారు. ప్రతి ఏటా పుష్య అమావాస్య సందర్భంగా జాతర జరుగుతుంది. కొండ సోరికలలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీ ఎత్తున పోటెత్తడంతో క్యూ లైన్ లో స్వల్ప తోపులాట జరిగింది.
దీంతో పలువురు భక్తులకు స్వల్ప గాయాలు కాగా తోపులాటలో ఓ మహిళా స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే పోలీసులు పరిస్థితి అదుపులోకి తెచ్చారు. భక్తులను క్రమ పద్ధతిలో స్వామివారి దర్శనానికి పంపిస్తున్నారు.