తెలంగాణ
మేడారం సమ్మక్క-సారలమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు

మేడారం సమ్మక్క-సారలమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అమ్మవార్ల దర్శనానికి భక్తులు తరలి వస్తున్నారు. దీంతో ఆలయ ప్రాంగణంలో రద్దీ పెరగడంతో గద్దెల లోపలికి అనుమతిని అధికారులు నిలిపివేశారు. దీంతో భక్తులు గ్రిల్స్ బయట నుంచే వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లిస్తున్నారు. మేడారం భక్తుల రాకతో జన జాతరను తలపిస్తుంది.



