Pawan Kalyan: పెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై విచారణకు పవన్కల్యాణ్ ఆదేశం

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. అటవీ భూముల ఆక్రమణలపై విచారణకు ఆదేశించారు. చిత్తూరు జిల్లా మంగళంపేట సమీపంలోని అడవుల్లో, భూ ఆక్రమణల వ్యవహారంలో పెద్దిరెడ్డిపై ఆరోపణలున్నాయి. దీంతో అటవీశాఖ ఉన్నతాధికారులకు పవన్ ఆదేశాలు జారీ చేశారు. విచారించి పీసీపీఎఫ్కు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
అటవీ భూములు ఏ మేరకు ఆదేశించారు.. అడవులను ఏ విధంగా ధ్వంసం చేశారో విచారణ చేపట్టాలని అధికారులను పవన్ ఆదేశించారు. పుంగనూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న అటవీ భూముల వివరాలు, వాటి రికార్డులను పరిశీలించి, ఆక్రమణల నివేదిక ఇవ్వాలని సూచించారు.
ముఖ్యంగా అటవీ భూముల రికార్డులు ఎక్కడైనా తారుమారు చేశారా? ఒకవేళ చేస్తే అందుకు బాధ్యులెవరూ? తద్వారా లబ్ది పొందినది ఎవరూ అనేది నివేదికలో వివరించాలని పవన్ చెప్పారు. మొత్తానికి అటవీ భూములు ఆక్రమించినవారిపై చట్టపరంగా ముందుకు వెళ్లాలని ఆదేశించారు.