తెలంగాణ
హైదరాబాద్లో మళ్లీ కూల్చివేతలు షురూ

హైదరాబాద్లోని ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. నగరంలో మళ్లీ కూల్చివేతల్ని షురూ చేసింది. గచ్చిబౌలిలో భారీ కూల్చివేతలు చేపట్టింది హైడ్రా సిబ్బంది. సంధ్య కన్వెన్షన్ సెంటర్ మినీహాల్ను నేలమట్టం చేశారు.
అదేవిధంగా పలు ఫుడ్ కోర్టులను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తోంది. కూల్చివేతల్లో భాగంగా సంధ్య కన్వెన్షన్ సెంటర్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. హైడ్రా ఫోర్స్ కూడా కూల్చివేతల్లో భారీ ఎత్తున పాల్గొంది.