జాతియం
Delhi Blast: ఢిల్లీ బాంబ్ పేలుడు వెనుక జైషే మహమ్మద్ ఉగ్రసంస్థలు

Delhi Blast: ఢిల్లీ బాంబ్ పేలుడు వెనుక జైషే మహమ్మద్ ఉగ్రసంస్థలు ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. పేలుడుకు ప్రధాన సూత్రధారి మౌల్వి ఇర్ఫాన్గా గుర్తించారు. అరెస్టైన డాక్టర్లతో మౌల్వి ఇర్ఫాన్తో సంబంధాలు ఉన్నట్లు విచారణలో బయటపడ్డాయి. జైషే మహమ్మద్ కోసం స్లీపర్ సెల్గా ఇర్ఫాన్ పనిచేస్తున్నట్లు గుర్తించారు.
అరెస్టైన డాక్టర్ల ఫోన్ల నుంచి అధికారులు డేటా సేకరించారు. ముజమ్మిల్ ఫోన్లో 200కు పైగా వీడియోలు గుర్తించారు. ఐసిస్ అనుబంధ ఉగ్రవాదుల ప్రసంగాల వీడియోలు ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ, ముంబై, యూపీతో పాటు రద్దీ ప్రదేశాల వీడియోలు కూడా ఉన్నాయి.



