తెలంగాణ
Telangana: తెలంగాణలో కారుకు డేంజర్ బెల్స్

Telangana: తెలంగాణలో బీజేపీ పార్టీ దూకుడు పెంచింది. బీఆర్ఎస్కు సవాల్గా పార్టీ బలోపేతం అవుతుంది. కమలం దూకుడుతో గులాబీ కారుకు బ్రేకులు పడుతున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించింది.
పట్టభద్రులు, ఉపాధ్యాయులు బీజేపీకే జై కొట్టడంతో ఉత్తర తెలంగాణలో కారుకు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గే ఛాన్స్ ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో బీఆర్ఎస్ పై ఆశలు పెట్టుకున్న శ్రేణులు అధినేత కేసీఆర్ క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగాలని కోరుతున్నారు.