తెలంగాణ
Cyber Crime: సైబర్ మోసం.. క్షణాలలో రూ. 70 లక్షలు స్వాహా చేసిన హ్యాకర్లు

Cyber Crime: సైబర్ క్రైమ్పై అవగాహన పెంచిన చాలా మంది సైబర్ మోసాల బారిన పడుతున్నారు. వనపర్తి జిల్లా బిట్ కాయిన్ ట్రేడింగ్లో సైబర్ మోసం జరిగింది. క్షణాలలో 70 లక్షలను సైబర్ నేరగాళ్లు స్వాహా చేశారు. వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన యాదయ్య గత ఎనిమదేళ్లుగా బిట్ కాయిన్ ట్రేడింగ్ చేస్తున్నాడు.
ఆఫర్ల కోసం లింకు క్లిక్ చేయగా క్రిప్టో ఖాతాలోని మొత్తం నగదు ఖాళీ అయ్యింది. దీంతో బాధితుడు యాదయ్య సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. పెద్ద మొత్తంలో మోసపోవడంతో బాధితుడు లబోదిబోమంటున్నారు. తనకు న్యాయం చేయాలని బాధితుడు వేడుకుంటున్నాడు.