తెలంగాణ

Cyber Crime: సైబర్ మోసం.. ఆన్‌లైన్ టాస్క్‌ పేరుతో మహిళకి రూ.11 లక్షల టోకరా..

Cyber Crime: పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో సైబర్ మోసం వెలుగుచూసింది. మహిళకు వాట్సాప్ లింక్ పంపి ఆమె నుంచి 11 లక్షలు కాజేశారు. ఓ మహిళకు కేటుగాళ్లు వాట్సాప్ లింక్ పంపారు. దానిపై ఆమె క్లిక్ చేశారు. దీంతో.. లైన్‌లోకి వచ్చిన కేటుగాళ్లు.. టాస్క్‌లు చెప్పి వాటిని పూర్తి చేస్తే.. లక్షల్లో నగదు బహుమతులు వస్తాయని నమ్మబలికారు.

ముందు ఆమెకు 2 వేల 7 వందలు చెల్లించి నమ్మకం కలిగించారు. ఆ తర్వాత రేటింగ్ వచ్చిందని 11 లక్షలు చెల్లిస్తే గెలుచుకున్న మొత్తం ఇస్తామని చెప్పారు. బాధితురాలు.. మొత్తం చెల్లించడంతో.. సైబర్ నేరగాళ్లు అదృశ్యమయ్యారు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు.. పోలీసులను ఆశ్రయించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button