ఆంధ్ర ప్రదేశ్
CPI Narayana: టీటీడీ గోశాలను సందర్శించిన సీపీఐ నేత నారాయణ

CPI Narayana: తిరుమల గోశాలను సీపీఐ నేత నారాయణ సందర్శించారు. గోశాలలో పనిచేస్తున్న కార్మికులతో నారాయణ ముచ్చటించారు. తిరుమల పవిత్రతతో పాటు టీటీడీ వ్యవస్థను కాపాడాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న ఇలాంటి దేవాలయాలకు చెడ్డ పేరు వస్తే అది తిరుపతి ప్రజానీకంతో పాటు సర్కార్కు అప్రతిష్టేనని నారాయణ అన్నారు.
గోశాల దాణా విషయంలో అక్రమాలు జరిగితే ఖచ్చితంగా ఆ అంశంపై విచారణ జరిపించాల్సిందేనని తీసుకోవాల్సిందేనని అన్నారు. ఇలాంటి విషయాలను పెండింగ్లో పెడితే ప్రజల్లో అనుమానాలు ఎక్కువయ్యే ప్రమాదం ఉందని నారాయణ అన్నారు. ఇలాంటి చోట రాజకీయాలు చేయడం తగదన్నారు.