Corona Virus: భారత్లో కోవిడ్ కలకలం… 5 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు

Corona Virus: భారత్లో కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. దేశంలో 5వేల364కు కరోనా యాక్టివ్ కేసులు చేరాయి. గడిచిన 24గంటల్లో కరోనాతో నలుగురు మృతి చెందారు. కేరళలో ఇద్దరు, పంజాబ్, కర్నాటకలో ఒక్కొక్కరు మృతి చెందారు. ఈ ఏడాది ఇప్పటి వరకు కరోనాతో 55 మంది చెందారు.
విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్లను ముచ్చటగా మూడోసారి ఆర్బీఐ సవరించింది. ఈసారి రెపో రేటును ఏకంగా 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు.
దీంతో రెపో రేటు 6 శాతం నుంచి 5.50 శాతానికి దిగొచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్లోనూ కీలక వడ్డీరేట్లను కేంద్ర బ్యాంకు 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ఈ నిర్ణయం వల్ల దీర్ఘకాలిక రుణాలు, ముఖ్యంగా గృహ రుణాలు తీసుకున్న వారికి ఈఎంఐల భారం తగ్గే అవకాశం ఉంది.