తెలంగాణ
శ్రీధర్కు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో SE శ్రీధర్ను ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. వాదనలు, ప్రతివాదనలు విన్న న్యాయస్థానం శ్రీధర్కు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో శ్రీధర్ను ఏసీబీ అధికారులు చంచలగూడ జైలుకు తరలించారు. ఇప్పటికే ఈకేసులో 150 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించినట్లు కోర్టుకు తెలిపారు. అదేవిధంగా శ్రీధర్ బ్యాంకు లాకర్లను ఓపెన్ చేయడానికి ఏసీబీ అధికారులు కస్టడీ కోరే అవకాశం కన్పిస్తోంది.