జాతియం
Corona Virus: దేశంలో కరోనా డేంజర్ బెల్స్.. ఢిల్లీలో 100 దాటిన కోవిడ్ కేసులు

Corona Virus: దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కొత్త రూపంలో కోవిడ్ పంజా విసురుతుండటంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఢిల్లీలో ఏకంగా 100 కేసులు దాటాయి. అత్యధికంగా కేరళలో 400 మందికి కరోనా పాజిటివ్ తేలింది. మొత్తానికి కేవలం వారం వ్యవధిలో 750కిపైగా కేసులు రికార్డయ్యాయి.
ముంబైలో ఈ నెలలోనే 95 కరోనా కేసులు నమోదయ్యాయి . ఇక ఢిల్లీలో 24 గంటల్లో 23 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో అన్ని రాష్ట్రాలను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తం చేసింది. వాస్తవానికి ఏపీ, తెలంగాణలోనూ రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. దీంతో రేవంత్ ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఇందులో భాగంగా గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక కరోనా వార్డులు ఏర్పాటు చేసింది. ప్రత్యేక వార్డుల్లో 60 పడకలు ఏర్పాటు చేసింది సిబ్బంది.