జాతియం
ఢీల్లీకి టీకాంగ్రెస్ మాదిగ ఎమ్మెల్యేలు

కేబినెట్ బెర్త్ కోసం తెలంగాణ మాదిగ ఎమ్మెల్యేలు లాబీయింగ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా కాసేపట్లో ఢీల్లీకి బయల్దేరనున్నారు టీకాంగ్రెస్ మాదిగ ఎమ్మెల్యేలు. హస్తినలో AICC చీఫ్ ఖర్గే, పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ను కలవనున్నారు. తమ సామాజిక వర్గానికి కేబినెట్లో ప్రాధాన్యం ఇవ్వాలని కోరనున్నారు. అంతేకాదు హైకమాండ్ పెద్దలందర్నీ కలు స్తామంటోన్నారు ఎమ్మెల్యేలు.
ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను కలిశారు. మాదిగ సామాజికవర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా సమస్యల్ని మీనాక్షి దృష్టికి తీసుకెళ్లారు. అయితే వీటన్నింటిపై హైకమాండ్తో మాట్లాడతానని మీనాక్షి నటరాజన్, మాదిగ ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు.