తెలంగాణ

తెలంగాణ కాంగ్రెస్‌లో గందరగోళం

తెలంగాణ కాంగ్రెస్‌లో గందరగోళం నెలకొంది. ఇప్పటివరకు పీసీసీ కార్యవర్గ విస్తరణ ప్రకటించలేదని, అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు చేయలేదని ఆశావహులు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలే మంత్రివర్గ విస్తరణను అడ్డుకుంటున్నారని ఇటు విపక్ష పార్టీలతో పాటు సొంతపార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

క్షేత్రస్థాయిలో ఉన్న అసలైన కాంగ్రెస్ నాయకులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పదవుల్లో, ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వడంలేదని మహిళా కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌లో ఊసరవెల్లి నాయకులకు పెద్దపీట వేస్తున్నారని మండిపడ్డారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button