ఆంధ్ర ప్రదేశ్

Simhachalam: సింహాచలం ప్రమాదంపై విచారణ కమిటీ ఆగ్రహం

Simhachalam: సింహాచలం ప్రమాదంపై విచారణ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో కమిటీ దర్యాప్తు ప్రారంభించింది. ఈఈ శ్రీనివాసరాజుపై విచారణ కమిటీ మండిపడింది. ఘటనా స్థలంలోనే త్రిసభ్య కమిటీ విచారిస్తుంది. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్ అధ్యక్షతన విచారిస్తుంది. కమిషన్ సభ్యులుగా ఐపీఎస్ అధికారి రవికృష్ణ, జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు ఉన్నారు.

అయితే విచారణ చేపట్టిన అధికారులు 72 గంటలలోపు నివేదిక ఇవ్వనున్నారు. నిన్న సింహాచలంలో గోడ కూలి ఏడుగురు మృతిచెందారు. లోపాలపై విచారించేందుకు ఘటనా స్థలికి కమిటీ చేరుకుంది. ఈ క్రమంలోనే ఘటనా స్థలానికి వైసీపీ నాయకులు చేరుకున్నారు. బొత్స సత్యనారాయణ, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button