Tirupati: తిరుపతి ఎస్వీ గోశాల వద్ద నాటకీయ పరిణామాలు.. భూమనకు కూటమి ఎమ్మెల్యేల ఫోన్

తిరుపతి ఎస్వీ గోశాల వద్ద నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కొద్దిసేపటి క్రితమే గోశాల వద్దకు చేరుకున్నారు వైసీపీ ఎంపీ గురుమూర్తి. ఈ క్రమంలోనే గోశాలలో ఆవుల మృతిపై ఆరోపణలు చేసిన వైసీపీ నేత భూమన కరుణా కర్ రెడ్డికి ఫోన్ చేశారు కూటమి ఎమ్మెల్యేలు. తక్షణమే గోశాలను సందర్శించి వాస్తవ పరిస్థితులను అందరికి తెలియజేయాలని ఫోన్లో వివరించారు. అసత్య ఆరోపణలు చేయడం సరికాదు.. క్షేత్రస్థాయికి రావాలని టీడీపీ ఎమ్మెల్యేలు భూమనని కోరారు.
ఇక పోలీసుల సూచనల మేరకు ఐదుగురితో గోశాలకు రావాలని భూమన కరుణాకర్ రెడ్డికి కూటమి ఎమ్మెల్యేలు సూచించగా తనకు భద్రత కల్పిస్తే గోశాలకు వస్తానని ఫోన్ కాల్లో నే భూమన టీడీపీ ఎమ్మెల్యేలకు వివరించారు. అయితే ఎస్పీతో మాట్లాడి ఎస్కార్ట్ పంపుతామన్నారు కూటమి ఎమ్మెల్యేలు. వైసీపీ నేతలకంటే ముందే గోశాలకు చేరుకున్న కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు గోశాలను సందర్శించారు. గోశాలపై వైసీపీ నేతలు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలోనే టీటీడీలో అక్రమా లు జరిగాయని నిప్పులు చెరిగారు.
ఇక గోశాల వివాదంపై ఎస్పీ హర్షవర్ధన్ స్పందించారు. లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని ఇరు పార్టీల ప్రజాప్రతినిధులను ఒకే సమయంలో అనుమతించ లేదని మీడియాకు వివరిం చారు. ఉదయం కూటమి నేతలు గోశాలను సందర్శించారని చెప్పారు. అయితే ఇప్పుడు వైసీపీ ఎంపీ గురుమూర్తి, భూమన కరుణాకర్ రెడ్డికి అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. ఏదీ ఏమైనా ఇరు పార్టీల ప్రజాప్రతినిధులు తమకు సహకరించాలని కోరారు ఎస్పీ హర్షవర్ధన్.
మొత్తానికి సవాళ్లు- ప్రతిసవాళ్లతో తిరుపతిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రధానంగా గోశాలలో గోవుల మృతిపై టీడీపీ వర్సెస్ వైసీపీగా సీన్ మారింది. గోశాలలో సిబ్బంది నిర్ల క్ష్యం వల్లే ఆవులు మృతి చెందాయని వైసీపీ నేత భూమన కరుణారెడ్డి ప్రధాన ఆరోపణ. కాదు వయస్సు పెరగడంతోనే ఆవులు మృతి చెందాయంటోంది టీడీపీ. ఈ నేపథ్యంలోనే గోశాల ఆవుల మృతిపై టీడీపీ- వైసీపీ సవాళ్లు చేసుకుంది.
ఇక గోశాలలో ఆవుల మృతిపై ఆరోపణలు కాదు.. చూసి వాస్తవాలు చెప్పాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే గోశాల సందర్శించాలని వైసీపీ అధినేత జగన్ అండ్ ఆ పార్టీ భూమన కరుణాకర్ రెడ్డి టీడీపీ సవాల్ విసిరింది. టీడీపీ సవాల్ను స్వీకరించిన భూమన గోశాలను సందర్శిస్తానని చెప్పారు. దీంతో గోశాలకు భూమన కరుణాకర్ రెడ్డి వస్తే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని గ్రహించిన పోలీసులు ముందస్తుగానే అలర్ట్ అయ్యారు. దీంతో గోశాల వద్ద భారీగా మోహరించారు.
అటు పద్మావతి పురంలోని భూమన నివాసం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గోశాలకు బయల్దేరిన భూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై పడుకుని భూమన కరుణాకర్ రెడ్డి నిరసన తెలిపారు.
మరోవైపు తిరుపతిలో వైసీపీ నేతలకు వ్యతిరేకంగా కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు వైసీపీ నేతల ఇళ్ల దగ్గర పోలీసులు మోహరించారు.