తెలంగాణ
Revanth Reddy: ఇవాళ సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయల్దేరనున్నారు. రెండ్రోజులపాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. రేవంత్ వెనక ఢిల్లీకి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వెళ్లనున్నారు. పీసీసీ చీఫ్ మహేష్గౌడ్తో కలిసి హస్తిన బాట పట్టనున్నారు ముఖ్యమంత్రి రేవంత్. పర్యటనలో భాగంగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ కానున్నారు.
తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాలను వివరించనున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో.. మంత్రివర్గ విస్తరణపై కూడా కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించనున్నారు. ముఖ్యంగా బీసీ కులగణన, ఎస్సీవర్గీకరణ అంశాలపై అసెంబ్లీలో చేసిన తీర్మాణాలపై.. హైకమాండ్కు వివరించనున్నారు రేవంత్.