తెలంగాణ
మూడ్రోజులుగా ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మూడ్రోజులుగా ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై నేడు అధిష్టానంతో ముఖ్యమంత్రి రేవంత్ మరోసారి భేటీ కానున్నారు. పార్టీ, పదవుల భర్తీపై రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. అదేవిధంగా మరోసారి ఖర్గేతో రేవంత్ భేటీ అయ్యే అవకాశం కన్పిస్తోంది. మరోవైపు ఏఐసీసీ నుంచి పిలుపు రావడంతో రాత్రి ఢిల్లీ చేరుకున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
శాఖల మార్పుపై వీరితో కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా మంత్రుల శాఖల్లో మార్పు లు చేసే యోచనలో హైకమాండ్ ఉన్నట్లు సమాచారం. మరోవైపు కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై రాహుల్ గాంధీ, ఖర్గేను కలవనున్నారు ఉత్తమ్, భట్టి.