Revanth Reddy: గిగ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించేలా బిల్లు రూపొందించాలి

Revanth Reddy: గిగ్ వర్కర్ల భద్రతపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ బిల్లు ముసాయిదా సిద్ధం చేయాలని కార్మిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గిగ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించేలా బిల్లు రూపొందించాలన్నారు. వారికి బీమా, ఇతర హక్కులు కల్పించేలా బిల్లు ఉండాలన్నారు. బిల్లు ముసాయిదాను ఆన్లైన్లో పెట్టాలని ప్రజల అభిప్రాయాన్ని సేకరించాలని సీఎం ఆదేశించారు.
సూచనలను తీసుకొని, వాటిని పరిశీలించి తుది ముసాయిదాను రూపొందించాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. గిగ్వర్కర్ల చట్టంలో కార్మికుల భద్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలన్నారు. కంపెనీలు, అగ్రిగేటర్లను సమన్వయం చేసేలా కొత్త చట్టం ఉండాలని చెప్పారు. ఈ నెల 25 నాటికి బిల్లు తుది ముసాయిదాను సిద్ధం చేయాలన్నారు. మే డే రోజున చట్టం అమల్లోకి తెచ్చేలా ఏర్పాట్లు చేయాలని కార్మిక శాఖ ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు.