తెలంగాణ

Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీ

Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు. ఇవాళ మరోసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో భేటీ కానున్నారు. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై చర్చించనున్నారు.

నిన్న రాహుల్, కేసీ వేణుగోపాల్‌తో కేబినెట్ విస్తరణపై దాదాపు గంటపాటు చర్చించనున్నారు. మరోవైపు మంత్రివర్గ విస్తరణపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నెలాఖరు లేదా వచ్చేనెల మొదటి వారంలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగే ఛాన్స్ ఉంది.

ఇప్పటికే మంత్రివర్గ విస్తరణపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టత ఇచ్చారు. ఆరు మంత్రివర్గ పదవుల ఖాళీల భర్తీపై భారీగా ఆశలు పెట్టుకున్నారు ఆశావాహులు. దీంతో మంత్రివర్గంలో ఎవరెవరికి అవకాశం వస్తుందనే అంశంపైన ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button