తెలంగాణ
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. ఆర్థిక, పౌరసరఫరాల శాఖల మార్పుపై చర్చ

ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి అధిష్టాన పెద్దలతో సమావేశమయ్యారు. హైకమాండ్తో ఆర్థిక, పౌరసరఫరాల శాఖల మార్పుపై చర్చిస్తున్నారు. మున్సిపల్, విద్యాశాఖతోపాటు ఇతర శాఖల కేటాయింపుపై కూడా చర్చ కొనసాగుతోంది.
శ్రీధర్బాబుకు ఐటీతోపాటు ఇతర శాఖలు కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా ముగ్గురు నూతన మంత్రులు ఎంపికైన సందర్భంగా వారికి కేటాయించాల్సిన శాఖలపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. పార్టీ పదవులపైన సైతం అధిష్టానంతో చర్చిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్.