తెలంగాణ
Revanth Reddy: కాంగ్రెస్ పార్టీ మహిళా శక్తిని ఎప్పుడూ గౌరవిస్తుంది

Revanth Reddy: జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్లో వీహబ్ ఉమెన్ యాక్సిలరేషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ స్టాళ్లను పరిశీలించారు. మహిళా శక్తిని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ గౌరవిస్తుందన్నారు సీఎం రేవంత్.
మహిళా శక్తిని ఇందిరాగాంధీ ప్రపంచానికి చూపించారన్నారు. ఆర్టీసీ కూడా ఇప్పుడు లాభాల బాటలో నడుస్తుందన్నారాయన. ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధుల యూనిఫామ్స్ ని కుట్టే బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించామని వెల్లడించారు.