
ఉత్తరాఖండ్లో కుంభవృష్టి కురుస్తుంది. మేఘాలకు చిల్లులు పడ్డాయా అనేంతలా.. బార్కోట్-యమునోత్రి మార్గంలోని సిలాయ్ బాంద్లో వర్షం దంచికొట్టింది. ఒక్కసారిగా వరద పోటెత్తడంతో నిర్మాణంలో ఉన్న ఓ హోటల్ ధ్వంసమైంది. దీంతో అక్కడ పనిచేస్తున్న 9 మంది కార్మికులు మృతి చెందారు. మరోవైపు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతు న్నాయి. రెస్క్యూ ఆపరేషన్లో పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయని జిల్లా కలెక్టర్ వెల్లడించారు.
మరోవైపు రెండ్రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచర్చింది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని, ప్రజలు జాగ్ర త్తగా ఉండాలని సూచించింది. అయితే ఉత్తరాఖండ్లో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నందప్రయాగ, భనేరోపాణి వద్ద జాతీయ రహదారి ధ్వంసమవడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.