ఆంధ్ర ప్రదేశ్
Tirupati: విద్యార్థినుల మధ్య ఘర్షణ.. రెండో అంతస్తు నుంచి కిందపడిన బాలిక

Tirupati: తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. శ్రీచైతన్య టెక్నో బాలికల పాఠశాలలో విద్యార్థినుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో ఓ విద్యార్ధిని రెండవ అంతస్తు నుండి క్రిందకు పడిపోయింది. ఈ ఘటనలో విద్యార్థినికి తీవ్రగాయాలయ్యాయి. బాధిత విద్యార్ధిని పాడిపేటకు చెందిన స్నేహగా గుర్తించారు. విద్యార్దినికి స్కూల్ యాజమాన్యం గుట్టుగా చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై విచారణ జరుపుతున్నారు.