తెలంగాణ
Tandur: ప్రజాపాలన వార్డు సభలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గొడవ

Tandur: వికారాబాద్ జిల్లా తాండూరులో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన వార్డు సభ ఇందుకు వేదికైంది. కాంగ్రెస్ నేతలు దొంగలు అంటూ బీఆర్ఎస్ కౌన్సిలర్ ఫైర్ అయ్యారు. దీంతో సభలో కాంగ్రెస్ నేతలు, బీఆర్ఎస్ కౌన్సిలర్ మధ్య చోటు చేసుకున్న వాగ్వివాదం ఉద్రిక్తతను తలపించింది.
కొత్త సంక్షేమ పథకాల అమలుకు అర్హులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం వార్డు సభలకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలోనే రెండో రోజు తాండూరు పట్టణంలోని 13వ వార్డులో వార్డు సభ ఏర్పాటు చేశారు. కౌన్సిలర్గా చిలుక వాగును అభివృద్ధి చేస్తే.. దొంగతనంగా బిల్లులు తీసుకున్నారని.. కాంగ్రెస్ నాయకుల దొంగలని బీఆర్ఎస్ నాయకులు ఫైర్ అయ్యారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసుల రంగం ప్రవేశం చేశారు. దీంతో గొడవ సద్దు మణిగింది.