జాతియం

Currency Notes: బంగ్లాదేశ్‌ కరెన్సీపై హిందూ, బౌద్ధ ఆలయాలు

బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హిందూ ఆలయాల బొమ్మలతో కూడిన నూతన కరెన్సీని విడుదల చేసింది. మాజీ ప్రధాని షేక్ ముజిబుర్ రెహమాన్ చిత్రం ముద్రించిన కరెన్సీ నోట్ల స్థానంలో సరికొత్త డిజైన్‌తో ఈ నోట్లను ప్రవేశపెట్టింది. హిందూ, బౌద్ధ ఆలయాల చిత్రాలను కరెన్సీ నోట్లపై ముద్రిస్తోంది. జూన్ 1 నుంచి ఈ కొత్త కరెన్సీ నోట్ల జారీ మొదలైంది.

నూతన డిజైన్, సిరీస్ ప్రకారం కరెన్సీ నోట్లపై మానవ చిత్రాలకు బదులుగా ప్రకృతి, ప్రసిద్ధ ప్రదేశాల చిత్రాలు ఉంటాయని బంగ్లాదేశ్ బ్యాంక్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. చారిత్రక ప్రదేశాలతో పాటు హిందూ, బౌద్ధ ఆలయాల చిత్రాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, దివంగత చిత్రకారుడు జైనుల్ అబెదిన్ గీసిన కళాఖండాలు కూడా ఉంటాయని వెల్లడించారు. మొత్తం తొమ్మిది డిజైన్లను రూపొందించగా, కొత్త నోట్లను నిన్న విడుదల చేశారు.

తూర్పు పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్‌గా పేరు మార్చుకున్న తర్వాత 1972లో కరెన్సీ నోట్లపై ఓ మ్యాప్‌ను ముద్రించారు. అనంతరం షేక్ హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్ చిత్రంతో కూడిన నోట్లను విడుదల చేశారు. గత ఏడాది ఆగస్టులో షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటికీ, ఆమె తండ్రి చిత్రం ఉన్న కరెన్సీ నోట్లను కొనసాగించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button