Operation Sindoor: పాక్ వెబ్ కంటెంట్పై కేంద్రం నిషేధం

Operation Sindoor: భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ కంటెంట్ను, ఆ దేశ ప్రేరేపిత కంటెంట్ను ఓటీటీల్లో నిషేధిస్తూ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నిషేధం తక్షణం అమల్లోకి వస్తుందని కేంద్రం తెలిపింది. ఈ ఉత్తర్వుల్లో పలు కీలక అంశాలను కేంద్రం ప్రస్తావించింది.
దాయాది దేశం పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న ఓటీటీ వేదికల కంటెంట్ను నిలిపివేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో భారత్లో పాక్ వెబ్ సిరీస్లు ఆగిపోనున్నాయి. సినిమాలు, పాటలు పాడ్ కాస్ట్ సహా మీడియా కంటెంట్ సేవలన్నీ రద్దు చేయాలన్నారు. వీటన్నింటిని అన్ని రకాల మీడియా కంటెంట్ ప్లాట్ ఫాం నుంచి తొలగించాలని భారత్కు చెందిన ఓటీటీ సంస్థలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
జాతీయ భద్రత దృష్ట్యా పాకిస్తాన్ మూలాలున్న ఓటీటీ కంటెంట్, ఓటీటీ వేదికలు, మీడియా స్ట్రీమింగ్ ప్లాట్ఫాంలు, మధ్యవర్తిత్వం ద్వారా అయ్యే ఏ ప్రసారమైనా ఇక పూర్తిగా నిలిపివేస్తున్నాం. పాకిస్తాన్ వెబ్ సిరీస్లు, సినిమాలు, పాటలు, పాడ్ కాస్ట్లు సహా మీడియా కంటెంట్ ఏదీ ఇక భారత్లో అందుబాటులో ఉండదు.
సబ్స్క్రిప్షన్, సహా ఇతర మార్గాల ద్వారా కంటెంట్ పొందుతున్న వారికీ ఇందులో ఏ మినహాయింపు లేదు. ఓటీటీ వేదికలు పాకిస్తాన్ కంటెంట్ను భారత్లో స్ట్రీమింగ్ చేయడానికి వీల్లేదని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశించింది.