News
ఐదు రాష్ట్రాలకు కేంద్రం వరద సాయం నిధులు విడుదల.. ఏపీ, తెలంగాణకు ఎంతంటే..?

ఏపీకి కేంద్ర ప్రభుత్వం భారీగా వరద సాయం ప్రకటించింది. విపత్తు, వరద సాయం కింద 5 రాష్ట్రాలకు కేంద్రం రూ. 1554.99 కోట్ల నిధులు కేటాయిచింది. ఇందులో ఆంధ్రప్రదేశ్కి 608.08 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఏపీతోపాటు తెలంగాణ, నాగాలాండ్, ఒడిశా, త్రిపుర రాష్ట్రాలకు నిధులు అందించింది.
తెలంగాణకు 231. 75 కోట్ల రూపాయలు, త్రిపురకు 288.93 కోట్లు, ఒడిశాకు 255.24 కోట్లు, నాగాలాండ్కు 170.99 కోట్లు మంజూరు చేసినట్లు హోంమంత్రి అమిత్షా తన ట్విట్టర్ఖాతాలో వెల్లడించారు. అన్ని రాష్ట్రాల్లోకి ఏపీకే ఎక్కువ సాయం ప్రకటించడం విశేషం.