News
Posani Krishna Murali: నరసరావుపేట టూటౌన్లోనూ పోసానిపై కేసు

Posani Krishna Murali: రాజంపేట సబ్జైలుకు చేరుకున్న నరసరావుపేట పోలీసులు పోసానిని అదుపులోకి తీసుకున్నారు. పీటీ వారెంట్పై పోసానిని నరసరావుపేటకు తరలిస్తున్నారు. వైద్య పరీక్షలు కూడా నిర్వహించినట్లు తెలుస్తుంది. కాసేపట్లో పోసానిని నరసరావుపేట కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం కన్పిస్తోంది. కాగా.. ఇప్పటికే నరసరావుపేట టూటౌన్లో పోసానిపై కేసు నమోదైంది.
అలాగే నేడు కడప కోర్టులో పోసాని బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. అయితే పోసానిని కస్టడీకి కోరుతూ పోలీసులు కూడా పిటిషన్ వేయనున్నట్లు సమాచారం. రైల్వేకోడూరు మెజిస్ట్రేట్ ట్రైనింగ్పై వెళ్ళడంతో కేసు విచారణ కడప కోర్టుకు బదిలీ అయ్యింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఫ్యామిలీ, మంత్రి నారా లోకేష్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇటీవల పోసానిని అరెస్ట్ చేశారు పోలీసులు.