జాతియం

Maha Kumbh: కుంభమేళాపై తప్పుడు కంటెంట్.. 140 సోషల్‌ మీడియా అకౌంట్ల పై కేసు నమోదు

Maha Kumbh: ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా మరికొన్ని గంటల్లో ముగియబోతుంది. ఇప్పటికే 60 కోట్లకు పైగా ప్రజలు త్రివేణీ సంగమం దగ్గర పుణ్య స్నానాలు చేశారు. ఇదిలా ఉంటే పలువురు ఇన్‌ఫ్లూయెన్సర్లు సోషల్ మీడియా వేదికగా కుంభమేళాపై తప్పుదోవ పట్టించే కంటెంట్‌ను క్రియేట్ చేస్తున్నారు. ఈ విషయం గుర్తించి పోలీసులు మొత్తంగా 140 సోషల్ మీడియా ఖాతాలపై కేసులు పెట్టారు. అందులో 13 మందిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు.

కుంభమేళాకు సంబంధించి అనేక మంది తప్పుడు వార్తలను క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా డబ్బులు సంపాదించుకోవడానికి తమకు నచ్చిన వార్తలను రాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. తప్పుడు వార్తలు క్రియేట్ చేసిన మొత్తం 140 సోషల్ మీడియా ఖాతాలను పోలీసులు గుర్తించారు. వెంటనే వాటన్నిటిపై కేసులు కూడా పెట్టారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button