ఆంధ్ర ప్రదేశ్
Byreddy Shabari: టీడీపీ నేత సంజన్న హత్యపై భావోద్వేగానికి గురైన ఎంపీ బైరెడ్డి

Byreddy Shabari: కర్నూలులో హత్యకు గురైన సంజన్న కుటుంబాన్ని ఎంపీ బైరెడ్డి శబరి పరామర్శించారు. ఘటనపై బైరెడ్డి శబరి భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. కక్షలకు, వర్గపోరుకు కుటుంబాలు బలి కాకూడదన్నారాయన.
సంజన్న కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని, తాను అండగా ఉంటానని బైరెడ్డి హామీ ఇచ్చారు. సంజన్న హత్య వెనక ఎవరున్నా వదిలిపెట్టేదిలేదన్నారు బైరెడ్డి. హంతకులు ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీకి ఓటు వేయాలని కత్తులు, కొడవల్లతో బెదిరిస్తూ తిరిగారని బైరెడ్డి శబరి ఆరోపించారు.