ఆంధ్ర ప్రదేశ్
దారుణం.. పిల్లలను కాలువలో విసిరేసిన కసాయి తండ్రి

కోనసీమ జిల్లా రామచంద్రపురంలో దారుణం చోటుచేసుకుంది. పిల్లలను కాలువలోకి విసిరేశాడు ఓ కసాయి తండ్రి. అయితే కాలువలో ఈత కొడుతూ బయటకొచ్చి ప్రాణాలతో బయటపడ్డాడు పదేళ్ల బాలుడు. కానీ.. పాప మాత్రం చనిపోయింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఆరేళ్ల పాప మృతదేహాన్ని కాలువ నుండి బయటకు తీశారు.
నెలపర్తి పాడులోని గణపతినగర్ లాకుల వద్ద ఘటన చోటుచేసుకుంది. ఈ దారుణానికి పాల్పడిన కసాయి తండ్రి రాజు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇక పిల్లలను కాలువలోకి విసిరేసిన రాజు చనిపోయాడా? పరారయ్యాడా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఘటనకు ఆర్థిక ఇబ్బందులే కారణమంటున్నారు స్థానికులు.