తెలంగాణ
Suryapet: పేలిన టైరు.. బస్సు దగ్ధం

Suryapet: రన్నింగ్ బస్సు టైరు పేలిన ఘటన సూర్యాపేట జిల్లా మోతె సమీపంలో చోటుచేసుకుంది. ఘటనలో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికులు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. ఖమ్మం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.