ఆంధ్ర ప్రదేశ్
Buddha Venkanna: నిన్న విజయవాడలో అల్లర్లకు జగన్ కుట్ర చేశారు

Buddha Venkanna: టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన ఆరోపణలు చేశారు. నిన్న విజయవాడలో అల్లర్లకు జగన్ కుట్ర చేశారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలోని రౌడీలందరినీ నిన్న విజయవాడ తరలించారని తీవ్ర విమర్శలు చేశారు. అయితే పోలీసులు ముందే గుర్తించి కుట్రను భగ్నం చేశారని చెప్పారు. పిల్ల సైకో వంశీని పరామర్శించేందుకు పెద్ద సైకో వచ్చాడంటూ ఎద్దేవా చేశారు.
ఇక పోలీసుల బట్టలూడిస్తా అన్నావ్.. మరి మీ పిల్లలను కలవాలన్నా పోలీసుల అనుమతి ఉండాలి కదా అని గుర్తుచేశారు. అయితే గతంలో ఇదే పోలీసులతో తమపై అక్రమ కేసులు పెట్టలేదా? అంటూ ప్రశ్నించారు బుద్దా వెంకన్న.