తెలంగాణ
Hyderabad: గంజాయి మత్తులో యువకుడి హత్య

Hyderabad:హైదరాబాద్ KPHB పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. గంజాయి మత్తులో యువకుడ్ని హత్య చేశారు. స్థానిక సర్దార్పటేల్ నగర్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి వీరంగంపై ప్రశ్నిస్తే దాడికి పాల్పడింది గంజాయి ముఠా.
గంజాయి ముఠా దాడిలో వెంకటరమణ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహం గాంధీకి తరలించారు.