తెలంగాణ
Hyderabad: కత్తులతో పొడిచి.. గొడ్డలితో నరికి.. యువకుడి దారుణ హత్య

Hyderabad: హైదరాబాద్లోని అల్లాపూర్ పీఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. శివాజీ నగర్లో భాను అనే యువకుడిని అతి కిరాతంకగా హత్య చేశారు దుండగులు. కత్తులతో పొడిచి గొడ్డలితో నరికి బండరాళ్లతో మోది అత్యంత దారుణంగా హతమార్చారు.
మర్డర్ అయిన వ్యక్తి భానుపై ఇప్పటికే బోరబండ, సనత్ నగర్ పీఎస్లలో పలు కేసులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే భాను హత్యకు పాతకక్ష్యలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.