తెలంగాణ
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఫైర్

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఫైరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పల్లెల అభివృద్ధి పూర్తిగా ఆగమైపోయిందని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలు సైతం పక్కనపెట్టి ఈ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయడం లేదని ఆయన మండిపడ్డారు.
ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిన ఎలాంటి అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. మెదక్ జిల్లా నర్సంపల్లి గ్రామంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.