తెలంగాణ
నల్గొండ జిల్లా మునుగోడులో బీఆర్ఎస్ నేతల నిరసన

నల్గొండ జిల్లా మునుగోడు మండలంలో బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను కూలగొట్టడాన్ని నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన శిలాఫలకాలను కాంగ్రెస్ పార్టీ ధ్వంసం చేసి అదే స్థానంలో నూతన శిలాఫలకాలను ఏర్పాటు చేయడం కరెక్ట్ కాదని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్ది అన్నారు. మండలంలో ఆగిపోయిన అభివృద్ధి పనులను తక్షణమే మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు.