ఆంధ్ర ప్రదేశ్
ప్రియురాలిని బండరాయితో చంపిన ప్రియుడు

ఎన్టీఆర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జగ్గయ్యపేట మండలం తిరుమలగిరిలో ప్రియురాలిని బండరాయితో మోది అతి దారుణంగా హత్య చేసాడు ప్రియుడు. మృతురాలు తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన మంగమ్మగా పోలీసులు గుర్తించారు. మంగమ్మ తన భర్తను వదిలిపెట్టి ఇద్దరు పిల్లలతో తిరుమలగిరిలో నివాసం ఉంటుంది. కొంతకాలంగా ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం మేనవోలుకి చెందిన మురళీకృష్ణతో మంగమ్మ సహజీవనం చేస్తోంది.
మద్యం మత్తులో ఇంటికి వచ్చిన మురళీకృష్ణతో మంగమ్మకి గొడవ జరిగింది. దీంతో మంగమ్మను మురళీకృష్ణ రోకలిబండతో కొట్టి చంపాడు. అయితే మంగమ్మపై అనుమానంతోనే హత్య చేశాడని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశాడు. ACP తిలక్ నేతృత్వంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.