తెలంగాణ
Mahabubabad: పల్లిగింజ గొంతులో ఇరుక్కుని 18నెలల బాలుడు మృతి

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా నాయక్పల్లిలో విషాదం చోటుచేసుకుంది. పల్లిగింజ గొంతులో ఇరుక్కుని 18నెలల బాలుడు మృతి చెందాడు. తొలుత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండగా చికిత్స నిమిత్తం MGM ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ బాలుడు అక్షయ్ మృతి చెందాడు. బాధిత కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతుండగా అక్షయ్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.