తెలంగాణ
తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపు

ఈ మధ్య ఎక్కడ చూసిన బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. సచివాలయానికి బాంబ్ పెట్టి పేల్చేస్తామని.. గత మూడ్రోజుల నుంచి ఆగంతకుడు ఫోన్ చేస్తున్నాడు. దీంతో.. భద్రతాసిబ్బంది అప్రమత్తమైంది.
వెంటనే బాంబు నిర్వీర్య బృందాలు, పోలీసులు రంగంలోకి దిగి సచివాలయాన్ని పరిశీలించారు. ఎలాంటి బాంబు లేదని తేల్చారు. ఫేక్ కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు ఫోన్ చేశాడన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.