తెలంగాణ
హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ ఈటల రాజేందర్

Eatala Rajendar: ఎంపీ ఈటల రాజేందర్.. హైకోర్టును ఆశ్రయించారు. పోచారం పీఎస్లో నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. స్థిరాస్తి వ్యాపారిపై చేయి చేసుకున్నారని ఈటల రాజేందర్పై కేసు నమోదైంది.
వాచ్మెన్ ఇచ్చిన ఫిర్యాదుతో పోచారం పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం కేసుపై పోలీసులకు నోటీసులు జారీ చేసింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.