తెలంగాణ
కిషన్రెడ్డి నేతృత్వంలో అమిత్షాను కలిసిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు

ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి నేతృత్వంలో బీజేపీ ఎంపీలు, కొత్తగా ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్సీలు కేంద్ర హోంమంత్రి అమిత్షాను కలిశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలను అమిత్ షా అభినందించారు. రాష్ట్రంలో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఉత్సాహంగా పనిచేయాలని అమిత్ షా అన్నారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని అమిత్ షా నేతలకు సూచించారు.