తెలంగాణ
MP Laxman: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్కు.. గ్రాడ్యుయేట్స్ బుద్ధి చెప్పాలి

MP Laxman: ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైందని.. కాంగ్రెస్, బీఆర్ఎస్కు అభ్యర్థులు దొరకడం లేదని ఎద్దేవా చేశారు ఎంపీ లక్ష్మణ్. గత పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్ఎస్.. ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ను పట్టభద్రులు నమ్మబోరన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలని చెప్పారు లక్ష్మణ్.