ఆంధ్ర ప్రదేశ్

ఏపీపై బీజేపీ హైకమాండ్ స్పెషల్ ఫోకస్.. కీలక అంశాలపై దిశానిర్దేశం చేయనున్న అమిత్ షా

ఏపీపై బీజేపీ హైకమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. రాష్ట్ర నేతలతో అమిత్ షా సమావేశమయ్యారు. భేటీలో భాగంగా ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిపై నేతలతో చర్చిస్తున్నారు. అదేవిధంగా కీలక అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గతం కంటే భిన్నంగా ప్రధాని మోదీ నిర్ణయాలు తీసుకుంటున్నా రు. అటు ఏపీలో పార్టీ ఎదుగుదలకు అమిత్ షా సైతం కొత్త వ్యూహాలు రచిస్తున్నారు.

ముఖ్యంగా కూటమిలో ఉంటూ సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీకి కొత్త అధ్యక్షుడు నియామకంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఇటీవల ఏపీకి కేంద్రం సహాయ సహాకారాలు అందిస్తోంది. దీంతో ప్రజల్లో సాను కూలత వస్తున్న సమయంలో.. పార్టీ బలోపేతం దిశగా అమిత్ షా వ్యూహాలు రచిస్తున్నారు. ఇటీవల అమరావతి, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఫ్యాకేజీలు ప్రకటించడంతో ఇప్పుడిప్పుడు బీజేపీపై ప్రజల్లో సానుకూలత ఏర్పడిందని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button