తెలంగాణ

Kishan Reddy: బీజేపీ కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy: బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జెండాను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. 1980 ఏప్రిల్ 6న అటల్ బిహారి వాజ్ పేయి అధ్యక్షతన బీజేపీని ప్రారంభించడం జరిగిందన్నారు కిషన్ రెడ్డి. ఆనాడు పార్టీని చాలా మంది అవహేళనగా చూశారని అధికారంలోకి వస్తుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేశారన్నారు.

బీజేపీకి ఓ ప్రత్యేకమైన సిద్ధాంతం ఉందన్నారు కిషన్ రెడ్డి. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేసేందుకు, దేశాన్ని అభివృద్ధి పథం వైపు తీర్చిదిద్దే లక్ష్య సాధనలోనే బీజేపీని ప్రారంభించడం జరిగిందన్నారు. వెంకయ్యనాయుడు, దత్తత్రేయ , ఇంద్రసేనారెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్ వంటి నేతలు పార్టీని ముందుకు నడిపించారని కిషన్ వ్యాఖ్యానించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button