తెలంగాణ
అమీన్పూర్ కేసులో ట్విస్ట్.. ప్రియుడితో బతకాలన్న ఆశతో పిల్లల్ని చంపిన తల్లి

Ameenpur Case Twist: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ ముగ్గురు చిన్నారుల మృతి కేసులో.. పోలీసుల దర్యాప్తులో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పిల్లలకు పెరుగన్నంలో విషం కలిపి చంపింది కసాయి తల్లని వెల్లడైంది.
ప్రియుడి మోజులో పడి కన్నబిడ్డలను చంపినట్టు తెలిసింది. మార్చి 27న పెరుగులో విషం కలిపి తినిపించింది. అనంతరం తాను కూడా అస్వస్థతకు గురైనట్టు నాటకం ఆడింది రజిత. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు రజిత ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు.