ఆంధ్ర ప్రదేశ్
Bhumana Karunakar Reddy: ఆధ్యాత్మిక క్షేత్రం విచ్ఛిన్నం చేయడమే టీడీపీ లక్ష్యం

Bhumana Karunakar Reddy: వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి కూటమిపై పలు కామెంట్స్ చేశారు. తిరుమల క్షేత్రంలో మరొక ఘోర అపచారం జరిగిందన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. తిరుమల పవిత్రతను కాపాడతామని చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు చేస్తున్నదేంటని వారు ప్రశ్నించారు. నిన్న పాప వినాశనము డ్యాంలో బోటింగ్ జరిగిందన్నారు భూమన.
అయితే దానిని ఎలా వివరణ ఇవ్వాలో అర్థంకాక ఫారెస్ట్ అధికారులు పర్యాటక క్షేత్రంగా మార్చడానికి జరుగుతున్నాయని ప్రచారం చేసినట్టు చెప్పారు. ఆధ్యాత్మిక క్షేత్రం విచ్ఛిన్నం చేయడమే టిడిపి లక్ష్యంగా చేస్తున్నారని భూమన ఆరోపించారు. తిరుమల చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదన్నారాయన.