తెలంగాణ
Bhatti Vikramarka: సంక్రాంతి పండుగ తర్వాత .. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రక్రియ మొదలవుతుంది

Bhatti Vikramarka: ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించారు. ఎరుపాలెం మండలం జమలాపురంలో అర్బన్ ఫారెస్ట్ అభివృద్ధి పనులకు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఎర్రుపాలెం మండలాన్ని టూరిజం పరిశ్రమగా అభివృద్ధి చేస్తామని భట్టి విక్రమార్క అన్నారు. టూరిజం అభివృద్ధితో స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు.
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం సర్వే జరుగుతుందన్నారు. లబ్ధిదారుల జాబితాను తయారు చేస్తున్నామన్నారు. సంక్రాంతి పండుగ తర్వాత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రక్రియ మొదలవుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.