తెలంగాణ
నేటి నుంచి హైదరాబాద్లో భారత్ సమ్మిట్

నేటి నుంచి హైదరాబాద్లో భారత్ సమ్మిట్ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈవెంట్ను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లోని నిపు ణులు ఈ సమ్మిట్లో పాల్గొననున్నారు.
ప్రపంచశాంతి, అహింస, న్యాయం, పెట్టుబడులే లక్ష్యంగా భారత్ సమ్మిట్ నిర్వహిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఎకనమిక్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్, సోషల్ జస్టిస్తోపాటు జెండర్ జెస్టిస్, యూత్ జస్టిస్, ఎకలాజికల్ జస్టిస్, పీస్ జస్టిస్ పేరుతో కార్యక్రమాలను నిపుణులకు వివరించనున్నారు.